తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-06-19T14:30:45+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు మొత్తం నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు మొత్తం నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టనుంది. శనివారం శ్రీవారిని 84,982 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 46,679 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.42 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.