బీజేపీకి మూడో స్థానమే: జగదీశ్రెడ్డి
ABN , First Publish Date - 2022-08-15T09:38:09+05:30 IST
మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో ఖాయమైందని, బీజేపీకి మూడో స్థానమే దక్కుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
నల్లగొండ/మర్రిగూడ, ఆగస్టు 14: మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో ఖాయమైందని, బీజేపీకి మూడో స్థానమే దక్కుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ పట్టణంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రాంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో, మర్రిగూడ మండల కేంద్రంలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలోంనూ మంత్రి మాట్లాడారు. దేశంలో బీజేపీకి బుద్ధి చెప్పే ఏకైక నాయకుడు కేసీఆర్ అని, మోదీ పతనం ప్రారంభమైందన్నారు. బీజేపీని తరిమికొట్టాలంటున్న వామపక్ష పార్టీలు తమతో కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్కి మతిస్థిమితం సరిగా లేదని, ఓ పిచ్చోడి చేతికి బీజేపీ రాష్ట్ర బాధ్యతలు అప్పజెప్పారని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ను లొంగదీసుకునే శక్తి ఇంకా భూమిమీద పుట్టలేదన్నారు. ఈడీ, సీబీఐలతో టీఆర్ఎ్సను బెదిరించాలని చూస్తే అది బీజేపీకి కలగానే మిగులుతుందన్నారు. 22 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసం రాజగోపాల్రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయారని ఆయన ఆరోపించారు.