జిల్లాకు మూడో జేసీ

ABN , First Publish Date - 2020-08-13T10:32:34+05:30 IST

జిల్లాకు మూడో జాయింట్‌ కలెక్టర్‌ను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే జిల్లాలో సుమిత్‌కుమార్‌, శ్రీనివాసులు జేసీలుగా కొనసాగుతున్నారు. తాజాగా ఆస

జిల్లాకు మూడో జేసీ

 ఆసరా, సంక్షేమం జాయింట్‌ కలెక్టర్‌గా శ్రీరాములునాయుడు 

 

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఆగస్టు 12: జిల్లాకు మూడో జాయింట్‌ కలెక్టర్‌ను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే జిల్లాలో సుమిత్‌కుమార్‌, శ్రీనివాసులు జేసీలుగా కొనసాగుతున్నారు. తాజాగా ఆసరా, సంక్షేమ శాఖ  జాయింట్‌ కలెక్టర్‌గా ఆర్‌.శ్రీరాములునాయుడు నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ మార్క్‌ఫెడ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.


మాతృశాఖ రిజిస్ట్రేషన్‌ అండ్‌ కోఆపరేషన్‌ డిపార్ట్‌మెంట్‌ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించారు. గతంలో విజయనగరం జిల్లా నీటి యాజమాన్య సంస్థ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఏడాది కిందట శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్‌గా పని చేశారు. త్వరలో ఆయన జిల్లా మూడో జేసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 

 

శ్రీకాకుళం ఆర్డీవోగా కిషోర్‌  

శ్రీకాకుళం రెవెన్యూ డివిజినల్‌ అధికారి ఎంవీ రమణకు బదిలీ అయ్యింది. ఆయన నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారిగా నియమితులయ్యారు. టెక్కలి రెవెన్యూ డివిజినల్‌ అధికారి ఐ.కిషోర్‌ శ్రీకాకుళం ఆర్డీవోగా వస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి నీలంసాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. 

Updated Date - 2020-08-13T10:32:34+05:30 IST