మూడో రోజు కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-05-08T05:46:09+05:30 IST

కరోనా కట్టడి కోసం ప్రకటించిన 14 రోజుల కర్ఫ్యూ మూడోరోజు అక్కడక్కడా జనం కనిపించారు.

మూడో రోజు కర్ఫ్యూ
సీ.క్యాంప్‌ రైతు బజార్‌లో జనం రద్దీ

కర్నూలు, మే 7(ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడి కోసం ప్రకటించిన 14 రోజుల కర్ఫ్యూ మూడోరోజు అక్కడక్కడా జనం కనిపించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారినా.. శివారు ప్రాంతాల్లో మాత్రం యథేచ్ఛగా తిరిగారు. చాలామంది 12లోపు పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఉదయం 10 నుంచి సి.క్యాంప్‌ రైతుబజార్లో విపరీతమైన రద్దీ కనిపించింది. ఎక్కడా కొవిడ్‌ నిబంధనలు పాటించలేదు. భౌతిక దూరం అస్సలు పాటించలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్‌, మార్కెటింగ్‌శాఖ ప్రత్యామ్నాయ కూరగాయల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నంద్యాల చెక్‌పోస్టు వద్ద ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.



Updated Date - 2021-05-08T05:46:09+05:30 IST