పనులను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-05-25T04:22:06+05:30 IST
జిల్లాలో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులను సంబంధిత శాఖల అధికారులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు.
- జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్
ఆసిఫాబాద్, మే 24: జిల్లాలో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులను సంబంధిత శాఖల అధికారులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎమ్మెల్యే అత్రం సక్కులతో కలిసి ఆర్ఆండ్బి, పంచాయతీరా జ్శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జిల్లాలో దెబ్బతిన్న రోడ్లను గుర్తించి అవసరమైన మర మ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. గతంలో అప్పగించిన పనులను చేయని కంట్రాక్టర్లను బ్లాక్లిస్టులో ఉంచాలని సూచిం చారు. నంబాల నుంచి నారాయణపూర్ వరకు రోడ్డు నిర్మాణం కోసం కేంద్రం నుంచి 25 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని చెప్పారు. పనులు వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని అదేశిం చారు. ఆటవీశాఖ అనుమతులు రాని ప్రాంతాన్ని మినహాయించి మిగిలిన చోట్ల పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని రైతు వేదికలకు మిషన్ భగీరథ పైప్లైన్ ద్వారా నీరు అందించాలని సూచించారు. సమావేశంలో ఆర్ఆండ్బి ఈఈ పెద్ద య్య, పంచాయతీరాజ్ డీఈఈ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.