మూసి ఉన్న రెస్టారెంట్‌లో పార్టీ చేసుకున్న దొంగలు.. తర్వాతి రోజు ఉదయం తలుపు తెరిచి చూసిన యజమాని షాక్!

ABN , First Publish Date - 2022-04-15T22:36:53+05:30 IST

అతను ఘజియాబాద్‌లో ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు.. ఎప్పటిలాగానే శుక్రవారం ఉదయం కూడా రెస్టారెంట్ ఓపెన్ చేశాడు.

మూసి ఉన్న రెస్టారెంట్‌లో పార్టీ చేసుకున్న దొంగలు.. తర్వాతి రోజు ఉదయం తలుపు తెరిచి చూసిన యజమాని షాక్!

అతను ఘజియాబాద్‌లో ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు.. ఎప్పటిలాగానే శుక్రవారం ఉదయం కూడా రెస్టారెంట్ ఓపెన్ చేశాడు.. అయితే లోపల దృశ్యం చూసి అతను షాకయ్యాడు.. రెస్టారెంట్‌లో ఉండాల్సిన విలువైన వస్తువులు, రూ.40 వేల నగదు కనిపించకుండా పోయాయి.. అంతేకాదు రెస్టారెంట్ ఫ్రిజ్‌లో ఉంచిన చికెన్, కూల్‌డ్రింక్స్, గులాబ్ జామూన్లు కూడా మిస్ అయ్యాయి. దీంతో వెంటనే ఆయన పోలీసులను ఆశ్రయించాడు. 


ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన అమన్ కుమార్ అనే వ్యక్తి నజీర్ ఫుడ్స్ పేరుతో ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు. శుక్రవారం ఉదయం అతను రెస్టారెంట్‌కు వచ్చి చూడగా తాళం విరిగిపోయి ఉంది. తలుపు తెరిచి చూస్తే లోపల విలువైన సామాన్లు కనిపించలేదు. అలాగే క్యాష్ బాక్స్‌లో ఉంచిన రూ.40 వేలు కూడా మిస్ అయ్యాయి. దొంగతనానికి ముందు దొంగలు రెస్టారెంట్‌లో విందు ఆరగించిన ఆనవాళ్లు కనిపించాయి. 


రెస్టారెంట్‌లోని తినుబండారాలు మాయమయ్యాయి. దీంతో అమన్ కుమార్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. రెస్టారెంట్‌లో ఉన్న సీసీటీవీ కెమేరాలను పరిశీలిస్తున్నారు.   

Updated Date - 2022-04-15T22:36:53+05:30 IST