నలుగురు దొంగల అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-05-15T06:15:47+05:30 IST

నలుగురు దొంగల అరెస్ట్‌

నలుగురు దొంగల అరెస్ట్‌
నిందితుల అరెస్టు చూపుతున్న ఏసీపీ రవీంద్రకుమార్‌

హసన్‌పర్తి, మే 14: దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని శుక్రవారం హసన్‌పర్తి పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాజీపేట ఏసీపీ రవీంద్ర కుమార్‌  వివరాల మేరకు.. ఖిలా వరంగల్‌కు చెందిన నల్ల కృష్ణార్జున్‌, బైరబోయిన శ్రీకాంత్‌, పోసాల అనురాగ్‌, పరకాల మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన అర్రబెల్లి ప్రవీణ్‌ ముఠాగా ఏర్పడి ఏప్రిల్‌ 5న హసన్‌పర్తి మండలం బైరాన్‌పల్లిలో సాంబశివుడిని కొట్టి అతడి మెడలోని బంగారు చైన్‌, సెల్‌ ఫోన్‌, నగదును దోచుకున్నారు. ఈ నలుగురు ఏప్రిల్‌ 14న హన్మకొండ మండలం పైడిపల్లిలో కొప్పుల పూజిత్‌కు చెందిన ద్విచక్ర వాహనాన్ని సైతం ఎత్తుకెళ్లారు.  శుక్రవారం పైడిపల్లి వద్ద పోలీసులు వాహనాల తనికీ చేపట్టగా నెంబరు ప్లేట్లు లేని రెండు ద్విచక్రవాహనాలపై వస్తున్న ఈ నలుగురిని పోలీసులు ప్రశ్నించగా వారు పారిపోయేందుకు యత్నించారు. పోలీసులు వారిని పట్టుకుని విచారించగా వారి దొంగతనాలు బయటకు వచ్చాయి. నలుగురు నిందితులను  అదుపులోకి తీసుకుని వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, 14 గ్రాముల బంగారు గొలుసు, మూడువేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రావు, ఎస్సై జితెందర్‌రెడ్డి, క్రాంతికుమార్‌, ప్రవీణ్‌, వెంకన్నను ఏసీపీ అభినందించారు.

Updated Date - 2021-05-15T06:15:47+05:30 IST