హోటల్ నిర్వాహకుడి ఇంట్లో చోరీ
ABN , First Publish Date - 2020-12-01T04:06:15+05:30 IST
హోటల్ నిర్వాహకుడి ఇంట్లో చోరీ
రూ.7 వేల నగదు, బంగారం అపహరణ
కేశంపేట: కేశంపేట మండల కేంద్రంలో విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా ఉన్న రాఘవేంద్ర హోటల్ యజమాని అంజయ్య ఇంట్లో ఈనెల 27న రాత్రి చోరీ జరిగింది. కేశంపేట ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సంతాపూర్ గ్రామానికి చెందిన అంజయ్య కేశంపేట మండల కేంద్రంలో హోటల్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఓ వ్యక్తి హోటల్లో పనిచేయడానికి కుదిరాడు. తనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నమని, తన పేరు రమేష్ అని చెప్పాడు. కాగా ఈనెల 27న అంజయ్య హైదరాబాద్లోని తన బంధువుల గృహ ప్రవేశం కార్యక్రమానికి వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన రమేష్ అంజయ్య ఇంట్లో బంగారు చెవి రింగులు, బంగారు మ్యాటీలు, కాళ్ల గొలుసులు, రూ.7 వేల నగదు, రెండు ఏటీఎం కార్డులు అపహరించి అక్కడి నుంచి జారుకున్నాడు. బాధితుడు అంజయ్య 28న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.