మళ్లీ వస్తారు: కాంగ్రెస్‌ను వీడుతున్న నేతలపై గెహ్లోత్

ABN , First Publish Date - 2022-01-27T22:37:39+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీలోని ముగ్గురు సీనియర్ లీడర్లు బీజేపీలో చేరారు. ఏడాది క్రితమే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇంచార్జీ జ్యోతిరాదిత్య సిందియా, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాద కమల తీర్థం పుచ్చుకున్నారు..

మళ్లీ వస్తారు: కాంగ్రెస్‌ను వీడుతున్న నేతలపై గెహ్లోత్

జైపూర్: పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి వరకు నేతలు పార్టీని వెళ్లిన నేతలు తిరిగి పార్టీలోకి రావడం కాంగ్రెస్ పార్టీకి సర్వసాధారణమేనని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ అన్నారు. గురువారం ఆర్‌పీఎన్ సింగ్ బీజేపీలో చేరడం గురించి ఆయనను ప్రశ్నించగా కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం లాంటిదని, ఇందులో ఎంతో మంది సీనియర్ లీడర్లు తయారు అవుతారని, అయితే అందరూ శాశ్వతంగా ఇక్కడే ఉండడం సాధ్యం కాదని, బయటికి వెళ్లడం మళ్లీ వెనక్కి రావడం సహజమేనని గెహ్లోత్ వ్యాఖ్యానించారు.


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీలోని ముగ్గురు సీనియర్ లీడర్లు బీజేపీలో చేరారు. ఏడాది క్రితమే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇంచార్జీ జ్యోతిరాదిత్య సిందియా, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాద కమల తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఆర్‌పీఎన్ సింగ్ సైతం హస్తానికి టాటా చెప్పి కాషాయ పార్టీలో చేరారు. ఇక గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషన్ అవార్డు రావడం గురించి గెహ్లోత్ స్పందిస్తూ ‘‘ఈ విషయమై మేం స్పందించాల్సిన అవసరం లేదు. ఎవరు ఏంటనేది ప్రజలకు బాగా తెలుసు’’ అని సమాధానం ఇచ్చారు.

Updated Date - 2022-01-27T22:37:39+05:30 IST