India vs Sri Lanka: భారత జట్టుపై శ్రీలంక కెప్టెన్ రియాక్షన్ ఇదీ!
ABN , First Publish Date - 2021-07-18T00:41:17+05:30 IST
భారత్తో రేపటి (ఆదివారం) నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీలంక జట్టు కొత్త కెప్టెన్ దాసన్
కొలంబో: భారత్తో రేపటి (ఆదివారం) నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీలంక జట్టు కొత్త కెప్టెన్ దాసన్ షనక భారత యువ జట్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. రెండు జట్లు ఒకే రకంగా తలపడబోతున్నాయని పేర్కొన్న దాసన్.. ఇండియా జట్టులో బోల్డంతమంది కొత్త ఆటగాళ్లు ఉన్నారన్నాడు. వారందరికీ ఐపీఎల్ ఆడిన అనుభవమే తప్ప అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అనుభవం ఏమాత్రం లేదన్నాడు. కాబట్టి ఈ సిరీస్లో ఇరు జట్లకీ సమాన అవకాశాలు ఉంటాయన్నాడు.
భారత్తో వన్డే, టీ20 సిరీస్ కోసం నిన్న 23 మందితో కూడిన జట్టును ప్రకటించిన శ్రీలంక దాసన షనకకు బాధ్యతలు అప్పగించింది. శ్రీలంక జట్టుకు గత నాలుగేళ్లలో దాసన్ పదో కెప్టెన్ కావడం గమనార్హం. భారత జట్టులో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అనుభవం లేని వారే ఎక్కువ మంది ఉండడం తమకు కలిసొచ్చే అంశమని దాసన్ పేర్కొన్నాడు. భారత్ లాంటి అగ్రశ్రేణి జట్టుతో ఆడిన తర్వాత తమకు బోల్డంత అనుభవం వస్తుందని అన్నాడు.