చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2022-05-23T05:26:44+05:30 IST

చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన మెదక్‌ జిల్లా హవేళిఘణపూర్‌ మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.

చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరి మృతి

 హవేళిఘణపూర్‌, మే 22: చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన మెదక్‌ జిల్లా హవేళిఘణపూర్‌ మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ మండలం రాజ్‌ల్లి గ్రామానికి చెందిన ఎరుకల గంగారాం(34), సిద్దిపేట జిల్లా చిన్నకోడురు మండలం గోనేపల్లి గ్రామానికి చెందిన దేవరాయ లక్ష్మణ్‌(18) తమ బంధువులైన తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన ఎరుకల సిద్ధిరాములు, నాగమని ఇంటికి ఎల్లమ్మ దేవి ఉత్సవాలను చూసేందుకు వచ్చారు. గ్రామ సమీపంలో గల గిద్దకుంట చెరువులో బంధువులతో కలిసి స్నానానికి వెళ్లారు. బంధువులైన మహిళలు బట్టలు ఉతుకుతుండగా.. గంగారం, లక్ష్మణ్‌ చెరువులో స్నానం చేస్తూ ముందుకు వెళ్లారు. ఆ తర్వాత నీటిలో మునుగుతున్నట్లు గమనించిన బంధువులు చీరల సాయంతో లాగేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. మృతుల కుటుంబీకులు మంగమ్మ, సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టు నిమిత్తం మృతదేహాలను మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరిలించినట్లు ఎస్‌ఐ మురళి తెలిపారు. 


 

Updated Date - 2022-05-23T05:26:44+05:30 IST