భగవద్గీత శ్లోకాల పోటీల విజేతలు వీరే
ABN , First Publish Date - 2020-08-15T11:22:31+05:30 IST
కృష్ణాష్టమి సందర్భంగా సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శ్లోక పోటీ
పెద్దాపురం, ఆగస్టు 14: కృష్ణాష్టమి సందర్భంగా సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శ్లోక పోటీల్లో విజేతలను సంస్థ ప్రతినిధి దర్భా శ్రీరామచంద్రమూర్తి శుక్రవారం తెలిపారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల విజేతల వివరాలను ఆయన వెల్లడించారు.
1,2,3 విభాగాల్లో జి.హాస్యారెడ్డి, శ్రీవాణి, కమల, నందిత, 4,5 తరగతుల విభాగంలో చింతల ఐశ్వర్య మహాలక్ష్మీ, కౌశల్, అనన్య, మహతి, 6,7 తరగతుల విభాగంలో అభినవ రుషి, శివానీ రెడ్డి, ధనుష్ కార్తీక్, శ్రీనివాస్, 8,9 తరగతుల విభాగంలో నిత్య, జోషిత, శ్రీజ, శశిప్రీతమ్, పది, ఇంటర్ విభాగాల్లో కౌస్తుభ్, సాయిహాస్యా,, సీహెచ్ మనస్వని, రత్నశ్రీ విజేతలుగా నిలిచారన్నారు.