ఆగస్ట్ 15.. ఈ దేశాల్లో కూడా ఇండిపెండెంట్స్ డేనే

ABN , First Publish Date - 2021-08-15T02:23:11+05:30 IST

బ్రిటీష్ వాళ్ల పాలనలో దాదాపు 200ఏళ్లపాటు స్వదేశంలోనే భారత పౌరులు బానిసలుగా బతికారు. ఎందరో మహానుబావుల త్యాగఫలితంగా ఆగస్టు 15, 1947లో ఇండియాకు స్వాతంత్ర్యం లభించింది. ఈ క్రమం

ఆగస్ట్ 15.. ఈ దేశాల్లో కూడా ఇండిపెండెంట్స్ డేనే

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటీష్ వాళ్ల పాలనలో దాదాపు 200ఏళ్లపాటు స్వదేశంలోనే భారత పౌరులు బానిసలుగా బతికారు. ఎందరో మహానుబావుల త్యాగఫలితంగా ఆగస్టు 15, 1947లో ఇండియాకు స్వాతంత్ర్యం లభించింది. ఈ క్రమంలో ఆ మహానుబావుల త్యాగాన్ని స్మరించుకుంటూ ఏటా వేడుకలు జరుపుకొంటున్నామన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా.. ఇండియా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ.. ఆగస్ట్ 15కు సంబంధించిన ఆసక్తికర విషయం గురించి ఓ లుక్కేద్దాం పదండి. ఆగస్టు 15న కేవలం భారత్ మాత్రమే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చేసుకోవడం లేదు. ప్రపంచంలోని చాలా దేశాలు ఇదే రోజును.. తమ ఇండిపెండెంట్స్ డేగా సంబరాలు చేసుకుంటున్నాయి. స్వాతంత్ర్యం పొందిన సంవత్సరాలు వేరైనా.. నార్త్ కొరియా, ఉత్తర కొరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, యూరోపియన్ కంట్రీ అయిన లిఖ్టెన్‌ష్టైన్.. భారత్‌తో పాటు తమ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పంచుకున్నాయి. బహ్రెయిన్ కూడా ఆగస్ట్ 15నే స్వాతంత్ర్యం పొందినా.. డిసెంబర్ 16న నేషనల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటోంది.


Updated Date - 2021-08-15T02:23:11+05:30 IST