ఈ పండ్లతో గుండె సమస్యలు దూరం
ABN , First Publish Date - 2020-04-04T16:33:45+05:30 IST
నారింజ, నిమ్మ వంటి పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయుల్లో గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు, మధుమేహం వంటి సమస్యల్ని సమర్థవంతంగా నివారించవచ్చని తాజా
ఆంధ్రజ్యోతి(04-04-2020)
నారింజ, నిమ్మ వంటి పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయుల్లో గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు, మధుమేహం వంటి సమస్యల్ని సమర్థవంతంగా నివారించవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. నారింజ, నిమ్మ వంటి పండ్లలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల అవి ఆరోగ్యాన్ని చక్కగా ఉంచడానికి తోడ్పడతాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఊబకాయుల్లో హానికర ప్రభావాల్ని యాంటీఆక్సిడెంట్లు నివారిస్తాయని ఎలుకల్లో చేపట్టిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. భవిష్యత్తులో నిమ్మజాతి పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లతో మనుషుల్లో ఊబకాయం ద్వారా తలెత్తే వ్యాధులను నివారించవచ్చని బ్రెజిల్లోని యూఎన్ఈఎన్పీకి చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. 50 ఎలుకలపై చేపట్టిన పరిశోధనల ద్వారా ఈ అంశాల్ని గుర్తించారు.