ఈ నిలదీతలు రిహార్సల్స్‌ మాత్రమే: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2022-05-28T08:06:55+05:30 IST

ఈ నిలదీతలు రిహార్సల్స్‌ మాత్రమే: సోమిరెడ్డి

ఈ నిలదీతలు రిహార్సల్స్‌ మాత్రమే: సోమిరెడ్డి

ఒంగోలు: గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నిలదీతలు రిహార్సిల్స్‌ మాత్రమేనని, తర్వాత ముఖ్యమంత్రినే ప్రజలు నిలదీయడం ఖాయమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వ్యవస్థల పతనంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘వ్యవస్థలను బలహీనపరచడం, వాటిని దుర్వినియోగం చేయడం జగన్‌రెడ్డికి అలవాటుగా మారింది. ఒకసారి జైలుకు వెళ్లివచ్చినా ఆయనలో మార్పు రాలేదు. తప్పుడు నిర్ణయాలకు ఐఏఎస్‌ అధికారులు జైలు శిక్షలు వేయించుకోవలసి వస్తోంది. కొన్ని చానళ్లంటే ముఖ్యమంత్రి భయపడుతున్నారు. పాపాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు’ అన్నారు.

Updated Date - 2022-05-28T08:06:55+05:30 IST