జిల్లా సరిహద్దుల్లో థర్మల్ స్ర్కీనింగ్
ABN , First Publish Date - 2020-05-31T11:03:18+05:30 IST
కరోనా వైరస్ నేపథ్యంలో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వ్యక్తులను సరిహద్దు ప్రాంతంలో థర్మల్ స్ర్కీనింగ్
ఆదిలాబాద్ టౌన్, మే 30: కరోనా వైరస్ నేపథ్యంలో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వ్యక్తులను సరిహద్దు ప్రాంతంలో థర్మల్ స్ర్కీనింగ్ నిర్వహించి వారి పూర్తి వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ శ్రీదేవసేన సూచించారు. శనివారం డొల్లార చెక్పోస్టును తనిఖీ చేసిన ఆమె చెక్పోస్టులో ఉన్న సిబ్బందితో పలు అంశాలపై మాట్లాడారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వారిని తప్పనిసరిగా థర్మల్ స్ర్కీనింగ్ చేసి వారి వివరాలు తెలుసుకోవాలన్నారు.