కరోనా సంక్షోభం ముగిసిపోలేదు.. మరిన్ని వేరియంట్లు రావచ్చు.. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-02-12T03:16:28+05:30 IST

కరోనా సంక్షోభం ముగింపు దశకు ప్రపంచం ఇంకా చేరుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్ తాజాగా వ్యాఖ్యానించారు.

కరోనా సంక్షోభం ముగిసిపోలేదు.. మరిన్ని వేరియంట్లు రావచ్చు.. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ హెచ్చరిక

ఇంటర్నెట్ డెస్క్: కరోనా సంక్షోభం ముగింపు దశకు ప్రపంచం ఇంకా చేరుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్ తాజాగా వ్యాఖ్యానించారు. మరిన్ని కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందని కూడా ఆమె పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో శుక్రవారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వైరస్‌లు జన్యుమార్పులను సంతరించుకుంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి.. మరిన్ని వేరియంట్లు, ఆందోళన కారక వేరియంట్లు పుట్టుకొచ్చే ఆస్కారం ఉంది. మనం కరోనా ముగింపు దశకు ఇంకా చేరుకోలేదు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఉన్న ఆమె..డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథానమ్‌తో కలిసి అక్కడి వ్యాక్సీన్ తయారీ ప్లాంట్లను సందర్శిస్తున్నారు.  

Updated Date - 2022-02-12T03:16:28+05:30 IST