భారత్‌లో కరోనా కేసులు పెరుగుతాయి, కానీ..: బయోకాన్ ఎండీ

ABN , First Publish Date - 2020-04-01T01:26:30+05:30 IST

భారత్‌లో త్వరలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతందని బయోకాన్ ఎండీ కిరణ్ మంజుదార్ షా తెలిపారు. అయితే అత్యవసర చికిత్స అవసరమయ్యే వారి సంఖ్య తక్కువగా ఉంచగలిగనంత కాలం భారతీయులు కంగారు పడాల్సిందేం లేదని ఆమె తెలిపారు.

భారత్‌లో కరోనా కేసులు పెరుగుతాయి, కానీ..: బయోకాన్ ఎండీ

న్యూఢిల్లీ: భారత్‌లో త్వరలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతందని బయోకాన్ ఎండీ కిరణ్ మంజుదార్ షా తెలిపారు. అయితే అత్యవసర చికిత్స అవసరమయ్యే వారి సంఖ్య తక్కువగా ఉంచగలిగితే భారతీయులు కంగారు పడాల్సిందేమీ ఉండదని ఆమె తెలిపారు. అత్యవసర చికిత్స అవసరమయ్యే కరోనా పేషెంట్ల సంఖ్యను భారత్ అదుపులో పెట్టినంత కాలం దేశం ఈ సంక్షోభాన్ని మ్యానేజ్ చేయగలదని ఆమె స్పష్టం చేశారు. అంటే.. వృద్ధులు, చిన్నారులు వంటి హై రిస్క్ వ్యక్తుల విషయంలో వీలైనన్నీ జాగ్రత్తలు పాటించాలని ఆమె చెప్పకనే చెప్పారు. 


Updated Date - 2020-04-01T01:26:30+05:30 IST