ప్రభుత్వ పథకాలపై సమగ్ర అవగాహన ఉండాలి
ABN , First Publish Date - 2020-05-20T10:15:02+05:30 IST
ప్రభుత్వ పథకాలపై సమగ్రంగా అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్-3 చెరుకూరి కీర్తి సూచించారు.
ప్రజలు,ప్రభుత్వానికి వారధిలా పని చేయాలి
జేసీ చెరుకూరి కీర్తి రమణయ్యపేటసచివాలయం సందర్శన
సర్పవరం జంక్షన్, మే 19: ప్రభుత్వ పథకాలపై సమగ్రంగా అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్-3 చెరుకూరి కీర్తి సూచించారు. రమణయ్యపేట గ్రామ సచివాలయాలన్ని మంగళవారం ఆమె సందర్శించారు. ప్రభుత్వ ప్రాధాన్యాంశాలను గుర్తించి వాటిని పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో మాట్లాడారు. సచివాలయ సిబ్బంది విధులు, బాధ్యతలు, ప్రభుత్వ పథకాల అమలుపై ఎంపీడీవో నారాయణమూర్తిని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎన్.వెంకటరెడ్డి ఉన్నారు.