వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం

ABN , First Publish Date - 2022-07-03T06:47:11+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం

మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు, జూలై 2: వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శనివారం కల్లూరు అర్బన్‌ 34వ వార్డు జంపాల శివయ్యనగర్‌, సంపత్‌నగర్‌లలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో  ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమె కాలనీల్లో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విదానాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. సీఎం జగన్‌ అధికారంలోకి రావడానికి హామీలు గుప్పించి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను విస్మరించడమే గాక.. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే నిత్యావసర ధరలు, గ్యాస్‌, పెట్రోల్‌ డీజిల్‌ రేట్లు పెరిగాయని, రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ వరుసగా విద్యుత్‌ చార్జీలు, బస్సు చార్జీలు పెంచుతూ చెత్తపై కూడా పన్నులు విధిస్తూ సొమ్ము చేసుకుంటుందని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కోశాధికారి మాదన్న, బీసీ సెల్‌ కార్యదర్శి కాసాని మహే్‌షగౌడు, పాణ్యం తెలుగు యువత ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఎస్‌.ఫిరోజ్‌, గంగాధర్‌గౌడు, ఎన్‌వీ రామకృష్ణ, తిరుమలేష్‌ రెడ్డి, బజారన్న, రమణమ్మ, రవిప్రకాష్‌రెడ్డి, కేవీ రమణారెడ్డి, గోపికృష్ణ, సులేమాన్‌, చంద్రశేఖర్‌, దిలీప్‌, రంగప్ప పాల్గొన్నారు.


Updated Date - 2022-07-03T06:47:11+05:30 IST