బీజేపీ నాయకులు పిచ్చి కూతలు కుస్తే సహించేది లేదు
ABN , First Publish Date - 2022-07-04T06:01:56+05:30 IST
బీజేపీ నాయకులు పిచ్చికూతలు కుస్తే సహించేది లేదని బీజేపీ నాయకులు జెఎన్ వెంకట్పై కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు ఫైర్ అయ్యారు.
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు
మెట్పల్లి, జూలై 3: బీజేపీ నాయకులు పిచ్చికూతలు కుస్తే సహించేది లేదని బీజేపీ నాయకులు జెఎన్ వెంకట్పై కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు ఫైర్ అయ్యారు. డాక్టర్గా ఉండి కరోనాకాలంలో ఎన్నడు కూడా ని యోజకవర్గంలో ప్రజలకు సేవ చేయలేని డాక్టర్ వెంకట్ తనను, తన కొ డుకు సంజయ్ను విమర్శిస్తే సహించేది లేదన్నారు. పట్టణంలోని అర్బన్ హౌజింగ్ కాలనీలో డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారులకు పట్టాల పంపి ణీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మా ట్లాడారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజసేవ చేస్తేనే ప్రజ లు తనపై నమ్మకంతో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. త మపై పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే పిచ్చికూతలు కుస్తున్నా రని అన్నారు. తాను ఏదైనా అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లయితే ము క్కు భూమికి రాసి తన ఆస్తి రాసిస్తానని, మెట్పల్లిని వదిలిపెట్టి వెళ్తా నని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత, వైస్ చైర్మన్ చంద్రశేఖర్రావు, కౌన్సిలర్రు పాల్గొన్నారు.
దేశంలోనే అద్బుత పథకాలు అమలు చేస్తున్నాం
దేశంలోనే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అద్బుత పథకాలు ప్రవే శపెట్టి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే విద్యాసాగర్రావు అన్నారు. ఆది వారం పట్టణంలోని అర్బన్ హౌసింగ్ కాలనీలో నూతనంగా గృహప్రవేశం చేసిన రెండు పడక గదుల ఇళ్ల లబ్దిదారులకు 110 మందికి ఇండ్ల పట్టా ల పంపిణీ ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండ డబుల్ ఇళ్ల నిర్మా ణం చేపట్టి పంపిణీ చేసామన్నారు. పార్టీలకతీతంగా ప్రజలకు న్యాయం చేస్తున్నామని అన్నారు. లబ్ధిదారులకు పట్టాలతో పాటు ఇంటి నెంబర్లు కేటాయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాణవేని సు జాత, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్రావు, కమిషనర్ సమ్మయ్య, తహసీల్దార్ సత్యనారయణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.