రొయ్యలపై కరోనా ప్రభావం లేదు
ABN , First Publish Date - 2020-02-20T09:40:10+05:30 IST
రొయ్యలపై కరోనా వైరస్ ప్రభావం లేదని, ఈ విషయాన్ని నిపుణులు తేల్చిచెప్పారని మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్
కోట, ఫిబ్రవరి 19 : రొయ్యలపై కరోనా వైరస్ ప్రభావం లేదని, ఈ విషయాన్ని నిపుణులు తేల్చిచెప్పారని మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చాన్ బాషా అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మత్య్సశాఖ సిబ్బందితో కరోనా వైరస్పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ప్రభావం చైనాలో వుందన్నారు దీని కదలికలు, పోకడలు ప్రభావం వంటివి కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, తడ, సూళ్ళూరుపేట ప్రాంతాల్లో ఎక్కడా లేవన్నారు. ఈ ప్రాంత రైతులు పండించే వెనామీ, స్కాంపీ రొయ్యలపై ఎలాంటి ప్రభావం వుండదని తెలిపారు. దీనిపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేమాలన్నారు. కాగా కరోనా ప్రభావం వల్ల రొయ్యల ఎగుమతులు పడిపోవడం వాస్తవమేనన్నారు. ప్రత్యేకంగా ఆక్వా రైతులను కరోనాపై అవగాహన కల్పించి చైతన్య వంతులు చేయాలని ఆయన కోరారు.