రైతుల పనులకు అవరోధం లేదు: ఏడీ

ABN , First Publish Date - 2020-03-30T09:06:40+05:30 IST

రబీ వరిసాగు పక్వ దశకు చేరుకుంటున్నందున రైతు వా రి పనులకు ఎటువంటి అడ్డంకి లేదని వ్యవసాయ శాఖ ఏడీ జీవీ పద్మశ్రీ చెప్పారు. సామాజిక దూరం పాటిస్తూ పొలాల్లో పనులు

రైతుల పనులకు అవరోధం లేదు: ఏడీ

సామర్లకోట మార్చి 29: రబీ వరిసాగు పక్వ దశకు చేరుకుంటున్నందున రైతు వా రి పనులకు ఎటువంటి అడ్డంకి లేదని వ్యవసాయ శాఖ ఏడీ జీవీ పద్మశ్రీ చెప్పారు. సామాజిక దూరం పాటిస్తూ పొలాల్లో పనులు చేసుకోవాలన్నారు. ఆంధ్రజ్యోతిలో ఆదివారం ‘అయ్యో అన్నదాత’ శీర్షికన వెలువడిన కథనానికి అధికారులు స్పందించారు.   సమస్యలపై సామర్లకోట మండలంలో పలువురు రైతులతో సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పంటను కోత కోసేందుకు యంత్రాలు రవాణాకు ప్రభుత్వం అ నుమతి ఇచ్చిందని చెప్పారు. యంత్రాలను ఎక్కడైనా నిలుపుదల చేస్తే సంబంధిత చెక్‌పోస్ట్‌ అధికారులకు టోల్‌ ఫ్రీ నెంబరు ద్వారా తెలియజేయాలని ఏడీ చెప్పారు.

Updated Date - 2020-03-30T09:06:40+05:30 IST