సండ్ర, ఉదయసింహపై ఆధారాలున్నాయి

ABN , First Publish Date - 2020-10-24T08:47:37+05:30 IST

ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్‌సింహ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లపై ఏసీబీ అధికారులు ఏసీబీ ప్రత్యేక

సండ్ర, ఉదయసింహపై ఆధారాలున్నాయి

ఓటుకు నోటు కేసులో డిశ్చార్జి పిటిషన్లపై ఏసీబీ కౌంటర్‌ 

హైదరాబాద్‌, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్‌సింహ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లపై ఏసీబీ అధికారులు ఏసీబీ ప్రత్యేక కోర్టులో కౌంటర్లు ఫైల్‌ చేశారు. ఈ కేసులో ఏ-5గా ఉన్న సండ్ర వెంకట వీరయ్య మిగతా నిందితులతో కలిసి కుట్రపన్నారని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.


రేవంత్‌ రెడ్డి(ఏ1), సెబాస్టియన్‌(ఏ2), ఉదయ్‌సింహ(ఏ3), జేరుసలెం మత్తయ్య(ఏ4)తో కలిసి సండ్ర వెంకట వీరయ్య అన్ని విషయాలపై చర్చించారని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కౌంటర్‌ పిటిషన్‌లో వివరించారు. 2015లో గండిపేటలో జరిగిన టీడీపీ మహానాడులో నిందితులు ఈ కుట్ర పన్నారని పేర్కొన్నారు. వారు దాఖలుచేసిన డిశ్చార్జి పిటిషన్లను కొట్టివేయాలని కోర్టు ను కోరారు. న్యాయస్థానం కేసు విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.



Updated Date - 2020-10-24T08:47:37+05:30 IST