వంశధారనగర్‌ కాలనీలో చోరీ

ABN , First Publish Date - 2020-07-14T10:22:23+05:30 IST

శ్రీకాకుళం నగరం సమీపంలోని వంశధార నగర్‌ కాలనీలో సోమవారం చోరీ వెలుగుచూసింది.

వంశధారనగర్‌ కాలనీలో చోరీ

 బంగారం, నగదుతో పాటు బైక్‌ను పట్టుకుపోయిన దొంగలు


శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, జూలై 13 :శ్రీకాకుళం నగరం సమీపంలోని వంశధార నగర్‌ కాలనీలో సోమవారం చోరీ వెలుగుచూసింది. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కాలనీలో భాస్కర నిలయంలో శిమ్మ స్వామిబాబు కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఈ నెల 11న కుటుంబ సభ్యులతో కలిసి క్యాంపు వెళ్లారు. ఆదివారం రాత్రి ఇంటికి చేరుకునేసరికి గేటు విరిగి పడి ఉంది. తలుపులు తెరిచి ఉంచడంతో చోరీ జరిగినట్టు గుర్తించాడు. బీరువాలోని అర తులం బంగారు ఉంగరం, రూ.10 వేలు నగదుతో పాటు ఆరుబయట ఉన్న ద్విచక్రవానం దొంగలు ఎత్తుకుపోయినట్టు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం హెచ్‌సీ తులసినాయుడు క్లూస్‌ టీంతో అక్కడకు చేరుకున్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Updated Date - 2020-07-14T10:22:23+05:30 IST