కత్తితో బెదిరించి దుకాణంలో చోరీ

ABN , First Publish Date - 2020-07-03T09:55:53+05:30 IST

పీకలదాకా మద్యం తాగిన ఓ వ్యక్తి దుకాణదారుడిని కత్తితో బెదిరించి చోరీ చేశాడు

కత్తితో బెదిరించి దుకాణంలో చోరీ

కుత్బుల్లాపూర్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): పీకలదాకా మద్యం తాగిన ఓ వ్యక్తి దుకాణదారుడిని కత్తితో బెదిరించి చోరీ చేశాడు. కుత్బుల్లాపూర్‌ పద్మానగర్‌ ఫేజ్‌-2లో గీతాంజలి స్కూల్‌ సమీపంలో అనిల్‌ అనే వృద్ధుడు స్టేషనరీ షాపు నిర్వహిస్తున్నాడు. ఎంఎన్‌రెడ్డి నగర్‌లో ఉంటున్న అఖిల్‌ అనే వ్యక్తి గురువారం ఉదయం అతిగా మద్యం తాగి షాపు వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వాలని వృద్ధుడిని డిమాండ్‌ చేశాడు. డబ్బు ఇచ్చేందుకు అనిల్‌ నిరాకరించడంతో కత్తితో బెదిరించి కౌంటర్‌లో ఉన్న రూ. 5వేలు తీసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిని పట్టుకొని పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌కు తరలించారు.

Updated Date - 2020-07-03T09:55:53+05:30 IST