పక్కింటికి వెళ్లొచ్చే సరికి ఇంట్లో చోరీ

ABN , First Publish Date - 2022-05-23T05:02:54+05:30 IST

గడియ పెట్టి పక్కింటికి వెళ్లొచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తి దొంగతనం చేసిన ఘటన మండలంలోని తునకిలో చోటు చేసుకుంది.

పక్కింటికి వెళ్లొచ్చే సరికి ఇంట్లో చోరీ

కౌడిపల్లి, మే22: గడియ పెట్టి పక్కింటికి వెళ్లొచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తి దొంగతనం చేసిన ఘటన మండలంలోని తునకిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎర్ర లింగమయ్య వ్యవసాయ పనుల నిమిత్తం శనివారం సాయంత్రం పొలానికి వెళ్లాడు. ఇంటి వద్దే ఉన్న లింగమయ్య భార్య దుర్గమ్మ కాసేపటి తరువాత  పక్క ఇంటి వారితో మాట్లాడానికి ఇంటికి గడియ పెట్టి వెళ్లింది. వచ్చి చూసేసరికి తలుపులు తీసి ఉన్నాయి. వెంటనే ఇంట్లోనికి వెళ్లి చూడగా బీరువా తెరిచి అందులోని 2 తులాల బంగారంతో పాటు విలువైన ఇతర వస్తువులు చోరీ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఏఎ్‌సఐ శ్రీనివాస్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-05-23T05:02:54+05:30 IST