షాబాద్‌ వైన్స్‌పక్కన ఫుడ్‌సెక్షన్‌లో చోరీ

ABN , First Publish Date - 2021-01-27T05:56:46+05:30 IST

షాబాద్‌ వైన్స్‌పక్కన ఫుడ్‌సెక్షన్‌లో చోరీ

షాబాద్‌ వైన్స్‌పక్కన ఫుడ్‌సెక్షన్‌లో చోరీ

  • రూ.5లక్షలు ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు


షాబాద్‌: మండల కేంద్రంలో ఉన్న విజయలక్ష్మి వైన్స్‌ పక్కనే గల ఫుడ్‌సెక్షన్‌ లో చోరి జరిగిన సంఘటన షాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం షాబాద్‌ పరిధిలోని కొమరబండకు చెందిన పెంజర్ల శేఖర్‌ షాబాద్‌లోని విజయలక్ష్మి వైన్స్‌ పక్కన గల ఫుడ్‌సెక్షన్‌లో కూలీగా పనిచే స్తూ ఉండేవాడు. ఈనెల 25న సోమవారం సాయంత్రం భూమి అమ్మిన డబ్బులు రూ.5లక్షలు ఎస్‌బీఐ నుంచి డ్రా చేసుకొని  ఫుడ్‌సెక్షన్‌లోని కిచెన్‌లో పెట్టాడు. అదేరోజు రాత్రి 8గంటలకు చూడగా డబ్బులు కనిపించకపోవడంతో చుట్టుపక్కల మొత్తం వెతికినా కనిపించలేదు. గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసి  ఉంటారని బాధితుడు పెంజర్ల శేఖర్‌ షాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-01-27T05:56:46+05:30 IST