ఆలయంలో చోరీ
ABN , First Publish Date - 2022-01-22T04:42:10+05:30 IST
స్థానిక శ్రీనాగారపమ్మ ఆలయంలో ఉన్న హుండీలోని నగదు శుక్రవారం రాత్రి చోరీకి గురైంది.
ఓజిలి, జనవరి 21 : స్థానిక శ్రీనాగారపమ్మ ఆలయంలో ఉన్న హుండీలోని నగదు శుక్రవారం రాత్రి చోరీకి గురైంది. పోలీసు స్టేషనుకు అతి సమీపంలో ఉన్న ఈ ఆలయంలో చోరీ జరగటంతో గ్రామస్థులు విస్తుపోయారు. ఇటీవల జరిగిన నాగారపమ్మ ఉత్సవాల తర్వాత హుండీలోని నగదును బయటకు తీయలేదని స్థానికులు అంటున్నారు. దీంతో హుండీలో భారీగానే నగదు ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఓజిలి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.