రాఘవరాజుపురంలో చోరీ
ABN , First Publish Date - 2021-02-27T05:11:10+05:30 IST
మండలంలోని రాఘవరాజుపురంలో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు రూ.2లక్షల నగ దు, 10 తులాల బంగారం అపహరణ చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యా దు చేశారు.
రూ.2 లక్షల నగదు, 10 తులాల బంగారం అపహరణ
రైల్వేకోడూరు రూరల్, ఫిబ్రవరి 26: మండలంలోని రాఘవరాజుపురంలో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు రూ.2లక్షల నగ దు, 10 తులాల బంగారం అపహరణ చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. పోలీసులు, బాధితులు అం దించిన వివరాల మేరకు.. రాఘవరాజుపురం గ్రామానికి చెందిన షేక్.ఫర్హాణ తన చెల్లెలు ఆరోగ్యం బాగాలేదని రాత్రి ఇంటికి తాళాలు వేసి ఎదురుగా ఉన్న వాళ్ల చెల్లెలు ఇంటికి వెళ్లి నిద్రించింది. శుక్రవారం తెల్లవారుజామున ఇంటికి వెళ్లి చూడగా ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కంగారుగా వెళ్లి రూమ్లో ఉన్న బీరువాను చూడగా బీరువా పగలగొట్టి అందులోని వస్తువులు చెల్లాచెదురగా పడేశారు. బీరువాలో ఉన్న రూ. 2 లక్షల నగదు, 10 తులాలు బంగారం చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ పెద్ద ఓబన్న సంఘటనా సఽ్ధలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీమ్ని పిలిపించి చుట్టుపక్క పరిసరాలను పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.