వేణుగోపాలస్వామి అలయంలో చోరీ
ABN , First Publish Date - 2020-08-09T11:08:37+05:30 IST
మండలంలోని ఉప్పుగుం డూరు వేణుగోపాల స్వామి అలయంలో శుక్రవారం అర్ధ రాత్రి చోరీ జరిగింది.
రెండు కిలోల వెండి ఆభరణాల అపహరణ
డాగ్స్క్వాడ్, క్లూస్టీమ్ పరిశీలన
నాగులుప్పలపాడు, ఆగస్టు 8: మండలంలోని ఉప్పుగుం డూరు వేణుగోపాల స్వామి అలయంలో శుక్రవారం అర్ధ రాత్రి చోరీ జరిగింది. శనివా రం తెల్లవారు జామున ఆల య ఆర్చకులు పూజా కార్య క్రమాలు నిర్వహించేందుకు ఆలయానికి రాగా, తలుపు గడియలు పగులగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు ఈవోకు సమాచారం అందించారు. ఈమేరకు ఈవో మీనిశెట్టి శ్రీనివాసరావు ఎస్ఐ సోమశేఖర్కు ఫిర్యాదు చేశారు. సుమారు రెండు కిలోల ఆరు వందల గ్రాముల వెండి అభరణాలు, ఒక గ్రాము బంగారం మాయమైనట్లు గుర్తించినట్లు ఎస్ఐ తె లిపారు. డాగ్ స్క్వాడ్, క్లూస్టీంతో ఆయన ఆలయాన్ని పరిశీలిం చారు. ఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.