మద్నూర్లో మద్యం దుకాణాల్లో చోరీ
ABN , First Publish Date - 2021-01-16T05:28:18+05:30 IST
మండల కేంద్రంలోని రెండు మద్యం దుకాణాల్లో చోరీ జరిగింది.
మద్నూర్, జనవరి 15: మండల కేంద్రంలోని రెండు మద్యం దుకాణాల్లో చోరీ జరిగింది. రూ.2లక్షల 71వేల నగదును ఎత్తికెళ్లినట్లు ఎస్సై రాఘవేందర్ తెలిపారు. సాయివైన్స్, దేవమ్మ వైన్స్లలోని సీసీ కెమెరాలను పరిశీలించగా, ఇద్దరు వ్యక్తులు నగదు ఎత్తుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బిచ్కుంద సీఐ సాజీద్ తెలిపారు.