కాశిరెడ్డినాయన ఆశ్రమంలో చోరీ

ABN , First Publish Date - 2020-09-19T10:10:46+05:30 IST

రేవనూరు పోలీస్‌స్టేషన్‌ పరిఽధిలోని కలుగొట్ల గ్రామంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రూ.50 వేలు చోరీ చేశారు. ఎస్‌ఐ సత్యనారా

కాశిరెడ్డినాయన ఆశ్రమంలో చోరీ

 భోజనం చేస్తుండగా రూ.50 వేలు అపహరణ


కోవెలకుంట్ల, సెప్టెంబరు 18: రేవనూరు పోలీస్‌స్టేషన్‌ పరిఽధిలోని కలుగొట్ల గ్రామంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రూ.50 వేలు చోరీ చేశారు. ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంజామల మండలం ఆకుమళ్ల గ్రామానికి చెందిన అనిమిరెడ్డి అనే వ్యక్తి గోస్పాడు మండలం ఎం.కృష్ణాపురం గ్రామంలోని తన భార్యకు చెందిన రూ.70వేలను సంచిలో పెట్టుకొని తిరిగి ఆకుమళ్ల గ్రామానికి వెళ్తూ కలుగొట్ల గ్రామంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద భోజనం చేయడానికి ఆగాడు.


భోజనం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు చేయి సంచిలో ఉన్న రూ.50వేలను అపహరించారని బాధితుడు రేవనూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2020-09-19T10:10:46+05:30 IST