వస్త్ర దుకాణంలో చోరీ

ABN , First Publish Date - 2020-10-24T12:13:32+05:30 IST

పట్టణంలోని ఓబుల్‌శెట్టి వారి వీధిలో ఉన్న వినాయకబాబు వస్త్ర దుకాణంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. దుకాణం షట్టర్‌ పగులగొట్టి ..

వస్త్ర దుకాణంలో చోరీ

రూ. 4లక్షల విలువైన చీరలు అపహరణ


పొదిలి, అక్టోబరు 23 : పట్టణంలోని ఓబుల్‌శెట్టి వారి వీధిలో ఉన్న వినాయకబాబు వస్త్ర దుకాణంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. దుకాణం షట్టర్‌ పగులగొట్టి లోపలకు ప్రవేశించిన దొంగలు రూ. 4లక్షల విలువైన చీరలు అపహరించుకెళ్లారు. వాటిలో 150 పట్టు, 100 ఫ్యాన్సీ చీరలు ఉన్నాయని యజమాని వినాయకబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం ఒంగోలు నుంచి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఆటోలో వచ్చి పెళ్లి చీరలు కొనేందుకు బేరమాడినట్లు తెలిపారు. వారే చోరీకి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. చోరీ జరిగిన దుకాణాన్ని సీఐ వి. శ్రీరామ్‌, ఎస్‌ఐ కె. సురేష్‌ పరిశీలించారు. ఒంగోలు నుంచి క్లూస్‌టీం అధికారులు పొదిలి చేరుకొని ఆధారాలు సేకరించారు.

Updated Date - 2020-10-24T12:13:32+05:30 IST