సెల్‌ఫోన్‌ దుకాణంలో చోరీ

ABN , First Publish Date - 2021-05-17T05:34:52+05:30 IST

సెల్‌ఫోన్‌ దుకాణంలో చోరీ

సెల్‌ఫోన్‌ దుకాణంలో చోరీ

మేడ్చల్‌ : మేడ్చల్‌ పట్ణణంలోని ఓ సెల్‌ఫోన్‌ దుకాణంలో చోరీ జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం సమీపంలో గల శివ మొబైల్‌ దుకాణంలో శనివారం రాత్రి దొంగలు పైకప్పును పగులగొట్టి దుకాణంలోకి చొరబడ్డారు. రూ.50 వేల విలువ గల సామగ్రిని ఎత్తుకుపోయారు. కాగా యజమాని ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయగా, క్లూస్‌ టీంను రప్పించి తనిఖీలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-05-17T05:34:52+05:30 IST