టీవీ రిపేర్ చేస్తానంటూ చోరీ..

ABN , First Publish Date - 2020-09-06T16:18:59+05:30 IST

గన్నవరం మండలం కేసరపల్లి శివాలయం సమీపంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది.

టీవీ రిపేర్ చేస్తానంటూ చోరీ..

కృష్ణా జిల్లా: గన్నవరం మండలం కేసరపల్లి శివాలయం సమీపంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగుడు టీవీ రిపేర్ చేస్తానంటూ అయినం పూడి పద్మ అనే మహిళ ఇంటికి వచ్చి ఆమె మెడలోని ఆరు కాసుల బంగారు గొలుసును దుండగుడు దొంగలించాడు. ఆ షాక్ నుంచి తేరుకున్న అనంతరం ఆమె గన్నవరం క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-09-06T16:18:59+05:30 IST