యువతిపై కత్తితో దాడి

ABN , First Publish Date - 2020-10-31T06:41:43+05:30 IST

యువతిపై కత్తితో యువకుడు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఽభద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణం పరిధిలోని సత్యనారాయణపురంలో గురువారం గురువారం అర్ధరాత్రి 12గంటల ప్రాంతంలో జరిగింది

యువతిపై కత్తితో దాడి

హత్యచేసేందుకు ప్రయత్నించిన యువకుడు


ఇల్లెందుటౌన్‌, అక్టోబరు 30: యువతిపై కత్తితో యువకుడు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణం పరిధిలోని సత్యనారాయణపురంలో గురువారం గురువారం అర్ధరాత్రి 12గంటల ప్రాంతంలో జరిగింది. ఇల్లెందు పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన ఓ  యువతి ఇల్లెందులోని సత్యనారాయణంలోని గల అమ్మమ్మగారి ఇంటివద్ద కొంతకాలం నుంచి ఉంటోంది. ఆమెకు ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. కొంతకాలంనుంచి ఇద్దరు చనువుగా ఉంటున్నట్లు గ్రామస్థులు తెలిపారు. సంవత్సర కాలంగా పరిచయంతో చనువు ఉండటంతో గురువారం ఆర్ధరాత్రి మాట్లాడే పని ఉందని యువతిని ఆమె ఇంటిసమీపంలో గల తాగునీటి చెరువు అలుగువాగు వద్దకు ఫోన్‌చేసి యువకుడు పిలిచాడు. పరిచయం ఉన్న వ్యక్తి పిలవడంతో వెళ్లిన యువతిని వాగు ప్రక్కన ఉన్న ముళ్లపొదల్లోకి లాక్కొని వెళ్లి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. గాయాలైన యువతి అక్కడే పడిపోయింది. కత్తితో దాడి చేసిన అనంతరం భయాందోళనకు గురైన యువకుడు తానే పోలీసులకు సమాచారం అందించాడు. స్పందించిన ఇల్లెందు పెట్రోలింగ్‌ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని యువతిని ఇల్లెందుప్రభుత్వ  వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైనా చికిత్సల కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడిపై హత్యయత్నం కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇల్లెందు సీఐ డి. రమేశ్‌ తెలిపారు. 

Updated Date - 2020-10-31T06:41:43+05:30 IST