నీళ్లలో పడి యువతి మృతి
ABN , First Publish Date - 2022-01-17T04:36:30+05:30 IST
నీళ్లలో ప డి మతి స్థిమితంలేని యువతి దివ్య (26) మృతి చెందింది. ఎస్ఐ జయరాములు కథనం మేరకు వివరాల్లో కెళితే...
రామాపురం, జనవరి 16: నీళ్లలో ప డి మతి స్థిమితంలేని యువతి దివ్య (26) మృతి చెందింది. ఎస్ఐ జయరాములు కథనం మేరకు వివరాల్లో కెళితే... పాతరామాపురం వాసి సు బ్బరాయుడు కుమార్తె దివ్యకు వివా హమైంది. అయితే మతిస్థిమితం లేదని భర్త ఆమెను పుట్టింట్లోనే వది లి వెళ్లాడు. తల్లి కువైట్కు వెళ్లడం ఆమె బాగోగులు తండ్రి సుబ్బరా యుడు చూసుకునేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి నుంచి దివ్య ఇంటి దగ్గర కనిపించలేదు. ఆదివారం ఆమె కోసం గ్రామస్తులు అన్నిచోట్లా వెతికారు. కాగా రామరాజు వంకలో ఆమె మృతదేహం లభ్యమైంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
వాహనం ఢీకొని యువకుడు....
దువ్వూరు, జనవరి 16: చింతకుంట సమీపంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని రాముడు (25) అనే యువకుడు మృతిచెందాడు. చింతకుంట సమీప దర్గా వద్ద నివాసం ఉన్న రాముడు జాతీయ రహదారిపై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. వాహనం ఢీకొనడంతో రోడ్డుపై పడిన వెంటనే వేగంగా వస్తున్న మరోవాహనం రాముడిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ కేసీ రాజు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు....
ఖాజీపేట, జనవరి 16: కడప-కర్నూలు జాతీయ రహదారి చెన్నముక్కపల్లె సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎ.యోహాన్ (60) మృతిచెందారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు ఎ.యోహాన్ పని నిమిత్తం చెన్నూరుకు వెళ్లాడు. తిరిగి చెన్నముక్కపల్లె సమీపంలో నడుచుకుంటూ వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో యోహాను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు.2 ఆర్సిటి 16: దివ్య మృతదేహం