చికిత్స పొందుతూ యువతి మృతి
ABN , First Publish Date - 2022-05-18T05:42:48+05:30 IST
చికిత్స పొందుతూ యువతి మృతి
కేశంపేట, మే 17: మండలంలోని కాకునూర్ గ్రామానికి చెందిన యువతి వ్యవసాయ పనులు చేస్తూ సొమ్మసిల్లిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. గ్రామానికి చెందిన రాములు యశోద దంపతులకు ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. వారిలో మూడో కూతురు శివాని(19) తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో తోడుగా ఉండేది. సోమవారం వారి వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా శివాని సొమ్మసిల్లి పడిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు కేశంపేటలోని ఓ ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి శంషాబాద్లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. యువతి మృతికి గల కారణాలు తెలియరాలేదు.