ఆర్మీ ఉద్యోగి మోసం చేశాడంటూ యువతి ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-08-12T11:27:56+05:30 IST
ఆర్మీ ఉద్యోగి తనను మోసం చేశాడంటూ ఓ యువతి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వెలిగండ్ల, ఆగస్టు 11 : ఆర్మీ ఉద్యోగి తనను మోసం చేశాడంటూ ఓ యువతి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల పరిధిలోని మొగళ్లూరు గ్రామానికి చెందిన ఓ యువతి... తనను ఆర్మీ ఉద్యోగి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్లపాటు సహజీవనం చేసి మరో పెళ్లి చేసుకుంటున్నాడని ఈ నెల 8న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు విచారణ చేయగా 10వ తేదీన ఆ ఉద్యోగి వేరే యువతిని వివాహం చేసుకున్నట్లు అమ్మాయి తరఫు బంధువులు తెలిపారు. ఆర్మీ ఉద్యోగిని పిలిచి విచారించగా తాను వివాహం చేసుకున్నానని చెప్పాడు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజ్కుమార్ తెలిపారు.