ఆటో నుంచి జారిపడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-01-19T04:54:54+05:30 IST

గోతుల రహదారి వల్ల ఆటో నుంచి జారి పడి ఓ యువకుడు మృతి చెందాడు. రాంకీ కమర్షియల్‌ హబ్‌ కూడలికి సమీపంలో సోమవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఆటో నుంచి జారిపడి యువకుడి మృతి
ఫకీర బిశ్వాల్‌(ఫైల్‌ ఫొటో)

పరవాడ, జనవరి 18: గోతుల రహదారి వల్ల ఆటో నుంచి జారి పడి ఓ యువకుడు మృతి చెందాడు. రాంకీ కమర్షియల్‌ హబ్‌ కూడలికి సమీపంలో సోమవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.  పరవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్రానికి చెందిన ఫకీర బిశ్వాల్‌(23) లంకెలపాలెం శివారు గెంజిపేటలోని క్యాంటీన్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. క్యాంటీన్‌ నుంచి భోజనాలను ఫార్మాసెజ్‌లో గల బయోకాన్‌ పరిశ్రమకు అందజేసి తిరిగి కంపెనీకి చెందిన కార్మికులతో కలిసి లంకెలపాలెం వెళ్లేందుకు ఆటోలో బయలుదేరాడు. ఆటో సరిగ్గా రాంకీ కమర్షియల్‌ హబ్‌ కూడలి సమీపంలోకి వచ్చేసరికి రహదారిపై ఉన్న గోతుల కారణంగా ఆటోలో వెనుక కూర్చొని సెల్‌ఫోన్‌ చూస్తున్న అతను ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. దీంతో అతని తలకు బలమైన గాయాలయ్యాయి. చెవి నుంచి కూడా రక్తం కారడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. అతను రెండు నెలల క్రితమే క్యాంటీన్‌లో హెల్పర్‌గా చేరాడు. పరవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-01-19T04:54:54+05:30 IST