బావిలో పడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-05-18T05:30:00+05:30 IST

బావిలో పడి యువకుడి మృతి

బావిలో పడి యువకుడి మృతి
యాదగిరి మృతదేహం

కొందుర్గు, మే 18: ప్రమాదవశా త్తు బావిలో పడి యువకుడు మృతిచెందిన సంఘటన మహదేవ్‌పూర్‌లో జరగింది. పోలీసులు తెలి పిన వివరాలిలా ఉన్నాయి. భైరంపల్లికి చెందిన మంగళి యాదగిరి (28) సోమవారం తన తల్లి కమలమ్మ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్లాడు. రాత్రికి ఇంటికి రాకపోవడంతో తల్లి వెతికింది. బుధవారం ఉదయం మహదేవ్‌పూర్‌లోని ఓ బావిలో యాదగిరి మృతదేహం తేలింది. యాదగిరి ప్రమాదవశాత్తు బావిలోపడి మృతిచెందినట్టు భావి స్తున్నామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. బాడీని భైరంపల్లికి తరలించామని, యాదగిరి అవివాహితుడన్నారు. కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

Updated Date - 2022-05-18T05:30:00+05:30 IST