బ్రిడ్జిపై నుంచి పడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-05-21T06:26:18+05:30 IST

మున్సిపాలిటీ పరిధిలోని నాగి రెడ్డిపల్లి రైల్వే బ్రిడ్జిపై నుంచి పడి శుక్రవారం ఓ యువకుడు మృతిచెందాడు.

బ్రిడ్జిపై నుంచి పడి యువకుడి మృతి
వెంకటరమణ (ఫైల్‌)


కదిరిఅర్బన, మే 20: మున్సిపాలిటీ పరిధిలోని నాగి రెడ్డిపల్లి రైల్వే బ్రిడ్జిపై నుంచి పడి శుక్రవారం ఓ యువకుడు మృతిచెందాడు. రైల్వే పోలీసు లు తెలిపిన  మేరకు... పట్ట ణంలోని న్యూ అమీననగర్‌కు చెందిన వెంకటరమణ(32) నాగిరెడ్డిపల్లిలో ఓ శుభకార్యానికి వెళ్లాడు. బ్రిడ్జి వద్దకు వెళ్లి పైనుంచి ప్రమాదవశాత్తు జారి పడి మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు నాయీబ్రాహ్మణుడనీ, భార్య, కుమారుడు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, శవాన్ని కదిరి ప్రభుత్వాసుప్రతికి తరలించినట్లు తెలిపారు.


Updated Date - 2022-05-21T06:26:18+05:30 IST