ప్రాణం తీసిన సరదా..
ABN , First Publish Date - 2021-06-21T06:47:05+05:30 IST
సిద్దవటం మండలంలోని లింగంపల్లె పెన్నానదిలో ఆదివారం సరదాగా ఈతకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతవ్వగా యువకుడిని అతడి స్నేహితులు వెతికే క్రమంలో చేపలు పెట్టేందుకు వెళ్లి మృతి చెందిన మరో వ్యక్తి మృతదేహం లింగంపల్లె పెన్నానదిలో లభ్యమైంది. వివరాలిలా ఉన్నాయి.
పెన్నానదిలో యువకుడు గల్లంతు
మరో వ్యక్తి శవం లభ్యం
సిద్దవటం, జూన 20: సిద్దవటం మండలంలోని లింగంపల్లె పెన్నానదిలో ఆదివారం సరదాగా ఈతకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతవ్వగా యువకుడిని అతడి స్నేహితులు వెతికే క్రమంలో చేపలు పెట్టేందుకు వెళ్లి మృతి చెందిన మరో వ్యక్తి మృతదేహం లింగంపల్లె పెన్నానదిలో లభ్యమైంది. వివరాలిలా ఉన్నాయి. చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లెకు చెందిన తంబిశెట్టి నీలకంఠ (26) అనే యువకుడు కడపలోని మృత్యుంజయకుంటలో నివాసం ఉంటున్న బంధువులు ఇంటికి వచ్చాడు. సరదాగా స్నేహితులతో కలిసి ఈతాడేందుకు వచ్చి పెన్నానదిలో గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం అతడి స్నేహితులు వెతుకుతుండగా కడప నగరంలోని అల్మా్సపేట ఎస్టీ కాలనీకి చెందిన వెంకటరమణ (28) అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నట్లు తెలిసింది. విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐ మధుసూదనరెడ్డి, ఏఎ్సఐ చంద్రానాయక్, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పెన్నాలో గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు మృతుడి బంధువులకు సమాచారం అందినట్లు ఎస్ఐ తెలిపారు.