చికిత్స పొందుతూ యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-01-21T06:58:16+05:30 IST

కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందు తూ ఓ యువకుడు మృతి చెందాడు.

చికిత్స పొందుతూ యువకుడి మృతి

నార్కట్‌పల్లి, జనవరి 20: కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందు తూ ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంఽధించి పోలీసులు, బం ధువులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన కొడతల సాయికుమార్‌ (22)కు తల్లిదండ్రులు లేరు. బంధువుల ఇంట్లో ఉం టూ వరికోత మిషనపై పనిచేస్తుంటాడు. ఒంటరి జీవితాన్ని గడుపుతున్నానని తరు చూ బాధపడేవాడు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం తాను చనిపోతున్నానని బంధువులకు ఫోన చేశాడు. మండలంలోని పోతినేనిపల్లి గ్రామశివారులో ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న బంధువులు సాయికుమార్‌ను తొలుత నార్కట్‌పల్లి కామినేనికి ఆ తర్వాత నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియాలో చేర్పించగా చికిత్స పొందు తూ ఈ నెల 19వ తేదీ సాయంత్రం మృతి చెందాడని పెదనాన్న నర్సింహ తెలిపా డు. నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 



Updated Date - 2022-01-21T06:58:16+05:30 IST