అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
ABN , First Publish Date - 2022-05-20T05:38:09+05:30 IST
మండల పరిధిలోని కొత్తపుల్లూరు గ్రామానికి చెందిన మద్దెల లక్షుమయ్య (25) అనే యువకుడు గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
ఖాజీపేట, మే 19 : మండల పరిధిలోని కొత్తపుల్లూరు గ్రామానికి చెందిన మద్దెల లక్షుమయ్య (25) అనే యువకుడు గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేర కు... రూబెన్, దీవమ్మ కుమారుడు మద్దెల లక్షుమయ్య పెయింటింగ్ పనిచేసేవాడు. ఉదయం బయటకు వెళ్లి మద్యం సేవించి ఇంటికి రావడంతో దీవమ్మ లక్షుమయ్యను మందలించింది. దీంతో ఆ గ్రామంలోని ఓ వ్యక్తి మద్యం తాపించాడని ఏమీ బాగోలేదని తెలిపాడని దీవమ్మ ఆరోపించింది. మంచంపై పడుకోమని చెప్పి దీవమ్మ పని నిమిత్తం బయటకు వెళ్లింది. అయితే ఇంటికి వచ్చి లక్షుమయ్యను లేపగా లేవకపోవడంతో 105 వాహనానికి సమాచారం అందించారు. అయితే లక్షుమయ్య అప్పటికే మృతి చెందాడు. సంఘటన స్థలానికి ఎస్ఐ కుళాయప్ప చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా లక్షుమయ్య తండ్రి రూబెన్ గతంలో అనారోగ్యంతో మృతిచెందాడు.