ప్రమాదంలో యువకుడు మృతి

ABN , First Publish Date - 2021-01-24T05:06:07+05:30 IST

పుట్రాయునిపేటలో శని వారం ఉదయం 8:15గం టలకు జరిగిన ప్రమాదం లో సింగం అశోక్‌కుమార్‌ (19) మృతిచెందాడు.

ప్రమాదంలో యువకుడు మృతి
అశోక్‌కుమార్‌ మృతదేహం

పులివెందుల, జనవరి 23: పుట్రాయునిపేటలో శని వారం ఉదయం 8:15గం టలకు జరిగిన ప్రమాదం లో సింగం అశోక్‌కుమార్‌ (19) మృతిచెందాడు. పో లీసులు తెలిపిన వివ రా ల మేరకు.... పుట్రాయుని పేట దళితవాడకు చెంది న సింగం అశోక్‌కుమార్‌ నడుస్తూ తోట వద్దకు వెళ్తుండగా గేటును తీసుకెళ్తున్న ఓ ట్రాక్టర్‌ వెనుకవైపు నుంచి ఢీకొంది.

దీంతో కిందపడిన అశోక్‌కుమార్‌కు తీవ్ర గాయాల య్యాయి. చికిత్స నిమిత్తం పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్య లో మృతిచెందినట్లు డాక్టర్‌ తెలిపారన్నారు. వలంటీర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా అశోక్‌కుమార్‌ వేముల ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు.

తల్లిదండ్రులు వెంకటరమణమ్మ, సుబ్బ మ్మకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడు కు సంతానం. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కడప (క్రైం), జనవరి 23: కడప నగరం అక్కాయపల్లె నేషనల్‌ హైవే కార్యాలయం ఎదుట శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజశేఖర్‌ (35) మృతి చెందినట్లు తాలు కా ఎస్‌ఐ రాఘవేంద్రారెడ్డి తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు.. కడప నభీకోటకు వాసి రాజశేఖర్‌ రాడ్‌ బెండర్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

శనివారం ఉదయం మరియాపురం వెళ్లి తిరిగి నభీకోటకు నడుచుకుంటూ వస్తుండగా అలంఖానపల్లె వైపు నుంచి కడప వైపు వస్తున్న బైకు వేగంగా వచ్చి ఢీకొనడంతో రాజశేఖర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆయనను రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృ తి చెందినట్లు తెలిపారు.  కేసు నమోదు చేసి బైకును సీజ్‌ చేసినట్లు తెలిపారు. 



Updated Date - 2021-01-24T05:06:07+05:30 IST