పెళ్లి జ‌రిగిన మూడో రోజే ఘోరం.. విష‌యం తెలిసి స్పృహ కోల్పోయిన న‌వ‌ వ‌ధువు!

ABN , First Publish Date - 2022-05-29T18:31:36+05:30 IST

న‌వ వ‌ధువు కాళ్ల‌కు పెట్టిన పారాణి ఇంకా ఆర‌నే లేదు.. పెళ్లికి వ‌చ్చిన బంధుమిత్రులు తిరిగి వెళ్ల‌నే లేదు..

పెళ్లి జ‌రిగిన మూడో రోజే ఘోరం.. విష‌యం తెలిసి స్పృహ కోల్పోయిన న‌వ‌ వ‌ధువు!

న‌వ వ‌ధువు కాళ్ల‌కు పెట్టిన పారాణి ఇంకా ఆర‌నే లేదు.. పెళ్లికి వ‌చ్చిన బంధుమిత్రులు తిరిగి వెళ్ల‌నే లేదు.. పెళ్లి సంద‌డి పూర్తిగా స‌ద్దుమ‌ణ‌గ లేదు.. వ‌రుడు తీసుకున్న దారుణ నిర్ణ‌యం తీవ్ర విషాదాన్ని నింపింది.. పెళ్లి జ‌రిగిన మూడో రోజే వ‌రుడు ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోయాడు.. విష‌యం తెలుసుకున్న న‌వ వ‌ధువు స్పృహ కోల్పోయింది.. దీంతో అప్ప‌టివ‌ర‌కు సంద‌డిగా ఉన్న ఇల్లు విషాద నిల‌యంగా మారిపోయింది.. రాజ‌స్థాన్ లోని పాలికి స‌మీపంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. 


ఇది కూడా చ‌ద‌వండి..

పెళ్లి రోజును మ‌ర్చిపోయిన భ‌ర్త‌.. భార్య చేసిన ప‌నికి షాక్.. చివ‌ర‌కు అస‌లు విష‌యం తెలిసి..!


పాలికి చెందిన శాకారామ్ (22) అనే యువ‌కుడు ముంబైలోని ఓ షాపింగ్ మాల్ లో ప‌ని చేస్తున్నాడు. వివాహ నిమిత్తం అత‌ను గ్రామానికి వెళ్లాడు. త‌న స‌మీప గ్రామానికి చెందిన మంజు అనే యువ‌తిని వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి జ‌రిగిన మూడో రోజే శాకారామ్ తన బెడ్రూమ్ లో విషం తాగి చనిపోయాడు. అత‌ని సోద‌రి చూసే స‌రికి నోటి నుంచి నుర‌గ‌లు వ‌స్తున్నాయి. హాస్పిట‌ల్ కు తీసుకెళ్లే స‌రికి శాకార‌మ్ మ‌ర‌ణించాడు. 


భ‌ర్త ఆత్మ‌హ‌త్య గురించి తెలుసుకున్న మంజు స్పృహ కోల్పోయింది. అప్ప‌టి వ‌ర‌కు పెళ్లి క‌ళ‌తో సంద‌డిగా ఉన్న ఇల్లు విషాదంతో నిండిపోయింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు శాకారామ్ మృత‌దేహాన్ని పోస్ట్ మార్ట‌మ్ కు త‌ర‌లించారు. శాకారామ్ మ‌ర‌ణానికి కార‌ణం ఏంట‌నేది ఇంకా తెలియ‌లేదు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాఫ్తు సాగిస్తున్నారు. 

Updated Date - 2022-05-29T18:31:36+05:30 IST