వైసీపీ ప్రభుత్వ అరాచకాలను అడ్డుకోవాలి
ABN , First Publish Date - 2022-06-25T05:16:52+05:30 IST
రాష్ట్రం లో వైసీపీ ఆరాచక పాలనను అడ్డు కోవాలని మదనపల్లె టీడీపీ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్ పిలుపునిచ్చారు.
మదనపల్లె టౌన్, జూన్ 24: రాష్ట్రం లో వైసీపీ ఆరాచక పాలనను అడ్డు కోవాలని మదనపల్లె టీడీపీ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్ పిలుపునిచ్చారు. శుక్ర వారం పట్టణంలోని 31వ వార్డులోని దిగువ కురవంక, రెడ్డీస్కాలనిలో టీఎన్టీ యూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొయ్యల మండి రాజారెడ్డి ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా దొమ్మలపాటి మా ట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ దుష్టపాలనకు మరో అవకాశం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నడుంబిగించి టీడీపీకి పట్టంకట్టేలా కృషి చేయా లని కోరారు. అనంతరం చంద్రబాబు నాయుడును సీఎం చేయాలని ఇంటింటా ప్రచా రం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు భవానిప్రసాద్, సిద్దప్ప, బాలుస్వామి, నీలకంఠ, రెడ్డిశేఖర్, నాగయ్య, చంద్రశేఖర్, నిస్సార్అహ్మద్ పాల్గొన్నారు.