మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపునకు వైసీపీ దొడ్డిదారి

ABN , First Publish Date - 2021-03-02T07:22:59+05:30 IST

మున్సిపాలిటీలో గెలుపు కో సం వైసీపీ బరి తెగిస్తోంది. దొడ్డిదారిలో పలు రకాలుగా ప్రలోభా లకు తెరలేపుతోంది.

మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపునకు వైసీపీ దొడ్డిదారి
సమావేశంలో మాట్లాడుతున్న వైసీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులు, హాజరైన డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు

ఓట్ల కోసం మహిళా సంఘాలతో రహస్య మంతనాలు 


కళ్యాణదుర్గం టౌన, మార్చి 1 : మున్సిపాలిటీలో గెలుపు కో సం వైసీపీ బరి తెగిస్తోంది. దొడ్డిదారిలో పలు రకాలుగా ప్రలోభా లకు తెరలేపుతోంది. ఇందులో భాగంగానే సోమవారం స్థానిక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణమండపంలో మహిళా సంఘాల సభ్యులతో వైసీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులు సమావేశమై రహస్య మం తనాలు జరిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని టీ డీపీ నియోజకవర్గ ఇనచార్జి మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు నిలదీశారు. ఓట్ల కోసం మహిళా సంఘాలపై తీవ్ర ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురిచేయడం సిగ్గుచేటన్నారు. అధికార పార్టీకి ఓటేయక పోతే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామంటూ ఓటర్లను ప్రలోభాల కు గురిచేస్తున్నట్లు ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు ఎ న్నికల కోడ్‌ను దుర్వినియోగం చేయడంపై ఎన్నికల సంఘం చర్య లు తీసుకోవాలన్నారు. 


వాటర్‌ క్యానలతో ప్రచారం 

 ప్రచార స్టిక్కర్లు అతికించి కోడ్‌ ఉల్లంఘన 

రాయదుర్గం:స్థానికంగా వైసీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రిబ్కా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించా రు. వాటర్‌ క్యానలకు పార్టీ ప్రచా ర స్టిక్కర్లను అతికించి పంపిణీ చే స్తున్న వైనం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కోడ్‌ ఉల్లంఘించినా పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. వైసీపీ కౌన్సిలర్‌ అ భ్యర్థి రిబ్కా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్యూరిఫైడ్‌ వాటర్‌ క్యాన్లపై ఎన్నికల ప్రచార స్టిక్కర్లను అతికించి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలువస్తున్నాయి. 



Updated Date - 2021-03-02T07:22:59+05:30 IST